Home  »  TV News  »  Karthika Deepam2 : వాడికి విడాకులు ఇవ్వు దీప.. నా కూతురికి సమాధానం చెప్పలేను బాబు!

Updated : May 25, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -53 లో......బావని ఎక్కువగా నమ్మేది నేనే.. అలాంటిది బావ గురించి నేనే ఇలా చెప్తున్నానంటే అర్థం చేసుకో మమ్మీ.. బావ పూర్తిగా మారిపోయాడని సుమిత్రతో జ్యోత్స్న అంటుంది. అసలు బావ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదనగానే అప్పుడే దశరథ్ వచ్చి.. నాకు కార్తీక్ అంతా చెప్పాడు.. ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేస్తారు. దాని గురించేం ఆలోచించకని జ్యోత్స్నకి సర్ది చెప్తాడు. నేను ఇప్పుడు నా దారికి తెచ్చుకుంటే మళ్ళీ దీని మైండ్ డైవర్ట్ చేస్తున్నారని పారిజాతం అనుకుంటుంది.

ఆ తర్వాత నర్సింహా స్టేషన్ లో ఉంటాడు. శోభ, అనసూయ స్టేషన్ బయట దీప కోసం వెయిట్ చేస్తుంటారు‌. అది ఎందుకు వస్తుందని శోభ అనగానే.. నా కొడుకు బయటకు రాకుంటే వాళ్ళ సంగతి చెప్తానని అనసూయ అంటుంది. అప్పుడే దీప, కార్తీక్ ఇద్దరు కార్ నుండి దిగుతారు. వాళ్ళు జంటగా రావడం చూసిన శోభ, అనసూయలు షాక్ అవుతారు. దీప, కార్తీక్ లు లోపలికి వెళ్తారు‌. కంప్లెంట్ వెనక్కి తీసుకుంటున్నానని ఇన్‌స్పెక్టర్ తో కార్తిక్ అంటాడు. దీప ఒకసారి ఆలోచించు.. వీడికి బుద్ది చెప్పాడానికి ఇదే మంచి ఛాన్స్ అని కార్తీక్ అంటాడు. మీరు ముందు సంతకం పెట్టండి అని దీప అంటుంది. కార్తీక్ కంప్లెంట్ వెనక్కి తీసుకుంటాడు. అనసూయ, శోభ, నర్సింహా వెళ్తుంటే.. అత్తయ్య మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారని చెప్పబోతుంటే‌‌.. నువ్వు ఇక ఏం మాట్లాడకంటూ.. తన తమ్ముడు దీప సొంతకూతురు కాదన్న విషయం దీపకి చెప్పొద్దని మాట తీసుకున్న విషయం అనసూయ గుర్తుకుచేసుకొని.. నా తమ్ముడు పొరపాటు చేసాడని దీపతో కోపంగా  అనేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కార్తీక్ వెళ్తుంటే దీప ఆపి.. మీరు ఎందుకు కేసు పెట్టారంటూ అడుగుతుంది.

ఆ తర్వాత దీప దగ్గరికి సుమిత్ర వచ్చి.. నువ్వు నీ భర్తకి విడాకులు ఇవ్వు. వాడు కట్టిన తాళిని మెడలో ఉందని కదా.. వాడు రెచ్చిపోతున్నాడని అనగానే.. నేను ఇవ్వను. శౌర్య ఇప్పుడు నాన్న ఎప్పుడు వస్తాడని అడుగుతుంది. ఈ తాళి తీసేస్తే నాన్న ఎవరని అడుగుతుంది. అలా ఆ ప్రశ్నకి సమాధానం ఉంది కానీ ఈ ప్రశ్నకి సమాధానం లేదని దీప అంటుంది. మరొకవైపు ఇలా సాయం చేసినప్పుడల్లా.. ఎదో ఒకరకంగా దీపని తప్పుగా అనుకుంటున్నారు. నా ప్రమేయం లేకుండా దీపకి హెల్ప్ చెయ్యాలని కార్తీక్ అనుకుంటాడు. మరొకవైపు దీప కేసు పెట్టిందని నర్సింహా చాలా కోపంగా ఉంటాడు. ఇక్కడికి వచ్చాకనే దీపకి వాడితో పరిచయం అయిందనుకున్న కానీ వాడి కోసమే ఇక్కడికి వచ్చిందని అర్థం అవుతుందని అనసూయతో నరసింహ అంటాడు. వాళ్ళు భార్య భర్తలలాగా స్టేషన్ కి వచ్చారని నర్సింహా అనగానే.. నీకు దెబ్బలు కొట్టిన బాధ కంటే నొప్పి ఎక్కవగా ఉన్నట్టుందని శోభ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.